తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది. రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మోహన్ రెడ్డి, నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్ జిల్లా అభ్యర్థిగా ఇనుగల వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించింది.