మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు చేరుకున్న సీఎం కేసీఆర్

సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడిగడ్డ దగ్గరకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్న ఆయన బ్యారేజ్ పనులను పరిశీలిస్తున్నారు.

Update: 2019-01-01 08:47 GMT
cm kcr

సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడిగడ్డ దగ్గరకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్న ఆయన బ్యారేజ్ పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని నీటి పారుదల శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు కేసీఆర్ సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన అనంతరం కన్నేపల్లి పంప్ హౌస్ పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ రాత్రికి కరీంనగర్‌లో బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం రాజేశ్వరరావు పేట పంప్‌హౌస్ పనులను పరిశీలిచనున్నారు .  

Similar News