పార్టీ అభ్యర్థుల ఫలిస్ట్ లిస్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 పార్లమెంట్ నియోజకవర్గాలపై తొలిదశ చర్చలు పూర్తి చేశారు. 175 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను నియమించారు. రాబోయే ఆరు నెలలు రాష్ట్రంలో అన్నీ ఎన్నికలే ఉంటాయని పార్టీ కోసం నేతలు విభేదాలు వదులుకోవాలని చంద్రబాబు సూచించారు. దశాబ్దాల వైరం మరిచి కడప, కర్నూలు జిల్లాలో నేతలు పార్టీ కోసం సంఘటితమయ్యారని గుర్తు చేశారు. కడప, కర్నూలు జిల్లా నేతలు పార్టీకి స్ఫూర్తిదాయమని అన్నారు. ఇక, జగన్కు ఓటేస్తే మోడీకి వేసినట్టేనని చంద్రబాబు మరోసారి విమర్శించారు. జగన్ రిమోట్ మోడీ, కేసీఆర్ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు.