చంద్రబాబు నివాసంలో ఉగాది వేడుకలు

Update: 2019-04-06 08:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. అమరావతిలోని సీఎం నివాసంలో ఉగాది సంబరాల్లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. వికారినామ సంవత్సర పంచాగాన్ని పండితులు చదివి వినిపించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తరతరాలుగా సాంప్రదాయంగా తెలుగు సంవత్సరాది జరుపుకొంటున్నామని చెప్పారు. జరగబోయే ఘటనల్ని ముందుగా ఊహించి చెప్పేదే పంచాంగ శ్రవణం అన్నారు. ఈ ఏడాది వానలు బాగా కురుస్తాయని పండితులు చెప్పడం శుభ పరిణామమన్నారు చంద్రబాబు.

Similar News