జగన్ అరాచకశక్తి అనేందుకు ఆయన అఫిడవిట్ నిదర్శనమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దేశంలో ఎవరి అఫిడవిట్లోనూ ఇన్ని కేసులు ఉండవని చెప్పారు. అరాచకాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధి , సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతుందన్నారు చంద్రబాబు.