టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నిశితంగా చర్చించనున్నారు. త్వరలో ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి సమాలోచనలు జరుపనున్నారు. గతంలో పార్టీ నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం జరిపారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు.