వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి కారణం ..చంద్రబాబు

Update: 2019-05-29 07:16 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి జగన్ పై ఉన్న సానుభూతి మాత్రమే కారణమని చంద్రబాబు అన్నారు .. టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ వాఖ్యలు చేసారు .. ప్రజలకు టీడీపీపై కోపం రావడం వల్ల మనం ఓడిపోలేదని చెప్పారు. మన ఓటమితో నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు . టీడీపీ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు. ఒక సీటుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ కూడా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే రీతిలో మనం కూడా ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని అయన పిలుపుని ఇచ్చారు .. 

Similar News