మోడీ కేబినెట్ తొలి నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ నిధి ద్వారా అమరవీరుల పిల్లలకు ఇస్తున్న స్కాలర్ షిప్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బాలురకు 2వేల రూపాయల నుంచి 2 వేల 500 రూపాయలకు స్కాలర్ షిప్ పెంచారు. ఇక బాలికలకు 2వేల 250 రూపాయల నుంచి 3వేల రూపాయలకు స్కాలర్ షిప్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది మోడీ కేబినెట్. ఈ విధానం రాష్ట్రాల్లోని పోలీసు అమరవీరుల పిల్లలకు కూడా వర్తించనుంది.