బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సహనాన్ని కోల్పోతున్నారు. యూపీలో బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ప్రజాప్రతినిధులమన్న విషయాన్ని మర్చిపోయి వేదికపైనే తన్నుకున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని కరీబ్నగర్లో జరిగిన పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిలాఫలకంపై పేర్ల విషయంలో బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేష్ సింగ్ మధ్య మాటా మాటా పెరిగింది. అయితే, ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీ త్రిపాఠి తన బూటు తీసుకొని చితకొట్టారు. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనుచరులు ఎంపీని కలెక్టర్ రూమ్లో బంధించారు. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చల్లబరిచారు. అయితే దీనికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని ఎమ్మెల్యే మద్దతురాలు ఎంపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.