కేసీఆర్‌ ఆ మూడింటికీ అంగీకరిస్తే నేను టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రెడీ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Update: 2019-04-15 04:56 GMT

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కలిసి వస్తానంటే టీఆర్ఎస్‌లో చేరుతానంటూ ప్రకటించారు. ఎంఐఎంతో దోస్తానా వదిలి గో సంరక్షణకు వస్తారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, గోవుల సంరక్షణ, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, తమ పోరాటానికి కేసీఆర్‌ కలిసి రావాలని కోరారు. ఈ మూడు అంశాల్లో బీజేపీ పోరాటానికి ఆయన కలిసి వస్తే తాను టీఆర్‌ఎస్‌లో చేరిపోయేందుకు సిద్ధమన్నారు. 

Similar News