మహబూబ్‌నగర్‌లో బీజీపీ గెలవడం ఖాయం: డీకే అరుణ

Update: 2019-04-12 12:20 GMT

మహబూబ్‌నగర్‌లో బీజీపీ గెలవడం ఖాయమని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరికి డికె అరుణ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాట్సప్ గ్రూప్స్‌లో తనపై అసభ్య కామెంట్స్ స్పందించారు డీకే అరుణ. కావాలనే తనపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్గాలపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రౌడీయిజం, గూండాయిజం అంటూ మహిళా అభ్యర్థిని ఇలా అవమానిస్తారా అని మండిపడ్డారు. తాను ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కానని ప్రజల్లో తనకు ఆదరాభిమానాలు ఉన్నాయని స్పష్టంచేశారు. 

Similar News