ఇంటర్ బోర్డు వైఫల్యాలతో సుమారు 23 మంది విద్యార్థులు చనిపోవడం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఇంటర్ విద్య ఒక దందాగా మారిందని విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఇచ్చిన నివేదిక సంతృప్తిగా లేదన్న ఆయన గ్లోబరీనా వెనుక ఎవరున్నారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయడంతో పాటు నిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.