ప్రధాని మోడీ, అమిత్ షా నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్ చంద్రబాబు, తెలుగు ప్రజల వెంట తాముంటామని స్పష్టం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో మోదీ వ్యవహరిస్తున్న తీరు భారత్ ప్రధానిలా కాకుండా పాకిస్తాన్ పీఎంలా ఉందంటూ ఆరోపించారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐతో దాడులు చేయిస్తున్నారని అన్నారు.