ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ లేఖ రాశారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు అప్పగించ వద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టలేనని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని చెప్పారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా అయన ఈ ఎన్నికల్లో పోటి చేయలేదు ..