నేడే ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల..

Update: 2019-06-04 02:12 GMT

నేడు ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అధికారులు విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు సెట్ ఫలితాలను ప్రైవేట్ హోటలలో విడుదల చేసేవారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. దుబారా ఖర్చులు తగ్గించాలన్న సీఎం ఆదేశాలతో ఈ విధంగా చేయనున్నారు. ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ఎంసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News