బీజేపీ దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తోంది -చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి బీజేపీని టార్గెట్‌ చేశారు. దేశంలో దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.

Update: 2019-01-06 09:16 GMT

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి బీజేపీని టార్గెట్‌ చేశారు. దేశంలో దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కోడ్డికత్తి కేసును ఎన్ఐఎకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేంద్రం ఏపికి నిధులు ఇవ్వడం లేదని ఏపి ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా ధర్మం మన వైపే ఉందని అందుకే అన్నీ సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఏపీసీఎం చద్రబాబు నాయుడు అన్నారు. మోడీ అన్ని రంగాలలోనూ విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్దారు.

Similar News