కౌంటింగ్‌ తర్వాత కూడా రీపోలింగ్‌ అవకాశాలు : ద్వివేది

Update: 2019-05-21 14:02 GMT

ఈనెల 27 అర్థరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కూడా కౌంటింగ్ పూర్తైన తర్వాత రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ద్వివేది స్పష్టం చేశారు. ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కలో తేడా వస్తే మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉంటాయని సీఈవో ద్వివేది వివరించారు.

Similar News