అంకంపాలెంలో భారీ కొండచిలువ

Update: 2019-04-25 09:09 GMT

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం పాటిచెరువు వద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది. చేపలు పట్టుకుంటున్న గ్రామస్తులకు 15 అడుగుల కొండ చిలువ కనబడటంతో పరుగులు తీశారు. చేపలు పట్టే వలలో కొండ చిలువను బంధించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. యువకులు కోళ్లను బంధించే ఇనుప బుట్టతో కొండ చిలువను బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

Similar News