దిగివచ్చిన పాక్... రేపే పైలట్ విడుదల..

Update: 2019-02-28 11:22 GMT

పాకిస్తాన్ చేతుల్లో బందీ అయిన భారత సాహస పైలట్ అభినందన్ వర్థమాన్ కోసం భారత్ తీసుకున్న చర్యలు ఫలించాయి. భారత్ దౌత్యపరమైన ఒత్తిడితో పాకిస్తాన్ దిగివచ్చింది. ఆయనను రేపు విడుదల చేయనున్నట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఆధారాలు సమర్పించాలని తాము చర్యలు తీసుకుంటామని భారత్‌కు చెప్పానని ఆయన గుర్తు చేశారు. 

Similar News