వైసీపీలోకి వలసల జోరు

Update: 2019-03-16 11:30 GMT

వైసీపీలో వలసల జోరు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన కీలకనేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. టీడీపీ తాజాగా ప్రకటించిన 126 అభ్యర్ధుల జాబితాలో ఆదాల కూడా ఉన్నారు. నెల్లూరు రూరల్ టికెట్ ఈయనకు టీడీపీ కేటాయించింది. అయితే, టీడీపీకి షాకిస్తూ వైసీపీలో చేరారు. అలాగే, వంగ గీత కూడ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని వంగా గీత ఆకాంక్షించారు. 

Similar News