తిరుమలను దర్శించుకున్న మోహన్ బాబు

Update: 2019-07-06 05:27 GMT

ఆంధ్రప్రదేశ్ కు మంచి ముఖ్యమంత్రి లభించారని, సీఎం జగన్ సారధ్యంలో మంచి పరిపాలన జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. తిరుమల శ్రీవారిని మోహన్ బాబు దర్శించుకున్నారు. వైసీపీ అధికారంలో రావడంతో తన కోరిక నెరవేరడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. తిరుమల శ్రీవారిని మిజోరాం మాజీ గవర్నర్ వినోద్ కుమార దుగ్గల్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూడా దర్శించుకున్నారు. 

Tags:    

Similar News