పంతంగి టోల్ ప్లాజా వద్ద గుండెపోటుతో వ్యక్తి మృతి

Update: 2019-05-29 05:46 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విషాదం చోటుచేసుకుంది ...RTC బస్సు లో ప్రయాణిస్తున్న పవన్ కుమార్ పాటిల్ అనే వ్యక్తి గుండెపోటు తో మృతిచెందాడు ...ఇతని వయస్సు 30సంవత్సరాలు .... రాజమండ్రి నుంచి హైదరాబాద్ హైవే ఫై ఉన్న టోల్ ప్లాజా వద్దకు బస్సు చేరుకోగానే పవన్ కు గుండెపోటు వచ్చింది ...వెంటనే పవన్ ను అంబులెన్సు లో చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ...కానీ అప్పటికే పవన్ మృతిచెందాడని వైద్యులు చెప్పారు ...దీంతో పోలీసులు ఎంక్వయిరీ చేసి మృతుడు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామ వాసిగా గుర్తించి ...వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు .....

Similar News