పాకిస్తాన్ దేశంలో చిక్కుకుని.. మరణశిక్ష విధించబడ్డ నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈరోజు భారత్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పునఃసమీక్ష జరపాలని సూచించింది. అంతవరకూ కుల్భూషణ్ మరణశిక్షను నిలిపి వేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది.