వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.