ప్రముఖ సినీనటి, తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతిపై నమోదైన మోసం కేసును కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.5.21 కోట్ల విలువైన ఆస్తిని తనకు విక్రయిస్తానని నమ్మించి, మరొకరికి ఇచ్చారని ఆరోపిస్తూ విజయశాంతిపై కేసు నమోదైంది.