జీఈఎస్ లో ఉపాసనకు స్వీట్ షాకిచ్చిన మిస్టర్ సి

Update: 2017-12-12 12:52 GMT

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ‎షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సు కు వివిధరంగాల్లో ఆరితేరిన మహిళలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలనుంచి సెలెబ్రెటీలకు కూడా అవకాశం కల్పించింది. వారిలో బ్రాహ్మణి, మంచు లక్ష్మి, మిథాలీ రాజ్ మరియు రామ్ చరణ్ సతీమణి ఉపాసన వాటి వారు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా జీఈఎస్ సదస్సులో ముందు వరుసలో పీఎం మోడీ, ఇవాంక ట్రంప్ పక్కన ఉపాసన కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టీవీ ద్వారా వీక్షించారట. ఉపాసన కనిపించగానే ఆమె ఫోటో తీశాడు. జీఈఎస్ సదస్సులో ఉన్న ఉపాసనకు ఆఫోటోని పంపాడు. థ్రిల్ కి గురైనా ఉపాసన వెంటనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నేను టివిలో కనిపించడం మావయ్య, మిస్టర్ సి ఇద్దరూ చూసారు. వెంటనే ఫోటో తీసి నాకు పంపారు అని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంది.

Similar News