దాదాపు 25 ఎల్లా కిందట తెలుగులో రాజశేఖర్, సుమన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుని, కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే నిర్మాత, దర్శకుడు ప్రియదర్శన ను వివాహం చేసుకున్న నటి లిజీ గుర్తుంది కదా..? 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి వెండితెరపై దర్శనమిచ్చేనందుకు రెడీ అయ్యింది. అదికూడా పవన్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాతో.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా మరోవైపు ఈ ఇద్దరూ సహనిర్మాతలుగా వ్యవహరిస్తూ నితిన్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఓ కీలకపాత్రతో వెండితెరపై తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది లిజీ.