కృష్ణజింకల కేసులో సల్మాన్ఖాన్ను దోషిగా తేల్చిన జోథ్పూర్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మిగతా నిందితులను జోథ్పూర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాంతో సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే, నీలమ్లు కేసు నుంచి బయటపడ్డారు.
1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. రాజస్థాన్ జోథ్పూర్ సమీపంలోని కంకణి అడవుల్లో రెండు కృష్ణజింకలను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 1998 అక్టోబర్లో వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదైంది. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదైంది. సుమారు 20ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జోథ్పూర్ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.