విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహింపట్నం వాసులు సీఎం ఇంటిని ముట్టడించారు. కిరోసిన్ డబ్బాలతో ఇంటికి చేరుకున్న ఆందోళన కారులు నిరసనకు దిగారు. తమ నివాసాలు అన్యాయంగా ఖాళీ చేయించి తమను మోసం చేశారంటూ ఆరోపించారు. ఈ విషయం మంత్రి దేవినేని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మనస్థాపం చెందిన ఓ బాదితుడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధితుడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.