విజయవాడలో సరోగసి దందా బయటపడింది. కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్లో అద్దె గర్భం దందా నడుస్తోంది. గుంటూరు నుంచి మహిళలను తీసుకొచ్చి అద్దె గర్భం కోసం మహిళలతో బేరసారాలు చేస్తున్నారు. అయితే అద్దె గర్భానికి ఓ మహిళ నిరాకరించడంతో కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ కోసమని చెప్పి గుంటూరు నుంచి ముగ్గురు మహిళలను తీసుకొచ్చిన కార్తీకదత్తా ఐవీఎఫ్ సెంటర్ యాజమాన్యం ఏమీ చెప్పకుండా ఏదో ఇంజక్షన్ ఇవ్వబోతుండగా ఓ మహిళ భయబ్రాంతులకు గురైంది. బాధితురాలు డయల్ 100కి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.