శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నటుడు శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత ఆదివారం తాను న్యూస్ ఛానెల్ చూస్తున్న సమయంలో శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్ను తీవ్రంగా దూషించిందని.. పవర్ స్టార్ ఫ్యాన్ అయిన తనను ఆ విషయం తీవ్రంగా కలిచివేసిందంటూ.. శివబాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పవన్ కల్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ఉద్దేశ్యంతోటే శ్రీరెడ్డి అలా మాట్లాడిదంటూ శివబాలాజీ తన ఫిర్యాదులో ఆరోపించారు.