పోలవరం ప్రాజెక్టు సమీపంలో రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ప్రాజెక్టుకు వెళ్లే రూట్లో రహదారి కుంగడంతోపాటు పెద్దఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాదు రోడ్లకు పగుళ్లు వచ్చిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు సైతం కూలిపోయాయి. దాంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. అయితే భూకంపం వస్తుందేమోనని స్థానికుల భయాందోళన చెందుతున్నారు. స్థానికుల భయాందోళనలతో పోలవరం ఇంజనీరింగ్ అధికారులు రోడ్లను పరిశీలిస్తున్నారు. అయితే రోడ్ల పగుళ్లకు వాతావరణ మార్పులే కారణమని అనుమానిస్తున్నారు.