బాలీవుడ్ లవ్ కపుల్ దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ల వివాహ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి తంతు కొనసాగుతోంది. ఇవాళ దక్షిణ భారతీయ సంప్రదాయం ప్రకారం వీరిరివురి వివాహం జరగనుంది. రేపు సింధీ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లా వీరి వివాహానికి వేదికైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు.
భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకే వివాహ కార్యక్రమాలు ప్రారంభం కాగా ఇదివరకే మెహందీ, సంగీత్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇటు ఈ వేడుక కోసం ప్రపంచ స్థాయిలో జరిగే సదస్సు కోసం చేపట్టే భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు వారం రోజుల పాటు దీపిక, రణవీర్ ఫ్యామిలీ సభ్యులు ఇక్కడే ఉండనున్నట్లు చెబుతున్నారు.