టాలీవుడ్ ను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన చిత్రం బహుబలి అని తెలిసిందే కాగా టాలీవుడ్లో ఇంకా పెళ్లికాకుండా బ్యాచిలర్స్ హీరోలు ఉన్నారు అందులో ముందుగా గుర్తుచ్చోది రానా, ప్రభాస్. అయితే బహుబలి గ్యాంగ్ తాజాగా ఎస్ఎస్ రాజమౌళిని, ప్రభాస్ మరియు రానా దగ్గబాటిలు అత్యంత ప్రజాదరణ గల టెలివిజన్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ నందు ధర్మ ప్రొడక్షన్స్ యజమాని మరియు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఆతిథ్యమిచ్చారు. ఈ షోలో కరణ్ బహుబలిల పెళ్లి విషయాన్ని కాస్తా రాజమౌళి కల్పించుకుని తన సమాధానంతో అందర్నీ సర్ప్రైజ్ చేశారట. ప్రభాస్ కన్నా ముందు రానానే పెళ్లి చేసుకుంటాడని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంగా తనకు బద్ధకం ఎక్కువని, అదే తన బలహీనతని ప్రభాస్ చెప్పారట.