వైసీపీలో విజయవాడ్ సెంట్రల్ నియోజక వర్గం సీటు వివాదం ముదురుతోంది. వంగవీటి రాధాకు సెంట్రల్ సీటుపై హామీ ఇవ్వకపోవడాన్ని రాధా అనుచరులు నిరసిస్తున్నారు. రాధాకు కాకుండా సెంట్రల్ సీటు ఎవ్వరికి ఇచ్చినా ఆ ప్రభావం చాలా నియోజక వర్గాలమీద పడుతుందని రాధా అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాధా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఆయన అనుచరులు అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. రాధాకు సెంట్రల్ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. గమనించిన రాధా అడ్డుకుని వారించారు. ఇద్దరి కళ్లల్లో పెట్రోల్ పడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి చర్యలను తాను సహించేది లేదని.. ఎవరూ ఆవేశపడవద్దని రాధా సూచించారు.