"ఆర్ఎక్స్ 100" మూవీతో నాకంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తీసుకొచ్చిందని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలిపారు. అమలాపురంలో దుర్గాస్ స్పైసీ ట్రీట్ రెస్టారెంట్’పాయల్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాయల్ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తున్నయని, అలాగే హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు ఇంకో చిత్రంలో కూడా నటిస్తున్నానని వెల్లడించారు. తన హింది టీవీ సిరియల్స్ లో నటిగా గుర్తింపుతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని పాయల్ రాజ్ పుత్ తెలిపారు. అసలు తన కోససీమకు రావడం ఇదే మొదటిసారని, ఇక్కడి వాతావరణం నన్ను చాలా ఆకట్టుకుందని, ఈ గోదవరి పాయలు నన్ను ఎంతోగానో ఆకర్షించాయని తెలిపింది.