రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం.. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికకు పవన్ కల్యాణ్ కళ్లజోడు పెట్టుకుని వచ్చారు. ఆ కళ్లజోడు పెట్టుకోవడానికి గల కారణం గురించి తెలుపుతూ..‘‘ కళ్లజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏమిటంటే.. నా కళ్లపై వెలుగు పడకూడదు. చిన్న ఐ ప్రాబ్లమ్ వచ్చింది. అంతేకానీ స్టయిల్ కోసం మాత్రం కాదు..’’ అన్నారు.