పద్మావతి చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిల్మ్ చుట్టూ అలుముకున్న వివాదానికి సెన్సార్ బోర్డు తెరదించింది. అయితే శనివారం ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సారు బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ పొందింది. అయితే సినిమా టైటిల్ను మార్చాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది. ‘పద్మావతి’ని కాస్త ‘పద్మావత్’ అని మార్చాలని చెప్పినట్లు సమాచారం. 26 సీన్లను తొలగించాలని ప్రారంభంలో వేసే ప్రకటనల విషయంలోనూ ప్యానెల్ షరతులు విధించినట్లు సమాచారం. అభ్యంతరాలు లేవనెత్తుతున్నవారితోపాటు, మేకర్ల తరపున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెన్సార్ బోర్డు అధికార వర్గం వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.