తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. తెలంగాణలో ఓటింగ్ పెరగడం ప్రజాకూటమికి అనుకూలమన్నారు. చంద్రబాబు ప్రచారంతో ప్రజల్లో భరోసా వచ్చిందన్న ఆయన ప్రజల సంక్షేమం కోసం తపన పడే వ్యక్తి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చినరాజప్ప వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో మైనారిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను అణగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.