ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూత

Update: 2018-03-01 07:08 GMT

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి కన్నుమూశారు. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా నాయని కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాబడి, పాఠశాల మ్యాగజైన్లు ప్రారంభించారు. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల అనురక్తి కలిగిన ఆయన 23 ఏళ్ల వయసులో యామినీకుంతలాలు పేరుతో మొదటి నవల రాశారు. నవలలతో పాటు కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. సినీ గేయ రచయితగానూ పనిచేశారు. మహర్షి సినిమాలోని సుమం ప్రతి సుమం సుమం పాటను రాశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి కృష్ణమూర్తి స్వగ్రామం. కృష్ణమూర్తి అంత్యక్రియలను రేపు స్వగ్రామం చౌడేపల్లిలో నిర్వహించనున్నారు.

Similar News