వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు రావంటూ సీఈసీ స్పష్టం చేయడంతో మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఉపఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని... ఈసీ ప్రకటనతో లోపాయికారి ఒప్పందం బహిర్గతమైందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టాలని ప్రయత్నించిన జగన్ కుయుక్తులకు ప్రజలే సమాధానం చెబుతారని లోకేశ్ అన్నారు.