దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. సావిత్రి జీవిత కథ ఆథారంగా మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదేబాటలో వైఎస్సార్ బయోపిక్ రానున్నట్లు టాక్. ఆనందో బ్రహ్మతో హిట్ కొట్టిన మహీరాఘవ సినిమాను డైరక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టి.. అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చారు అనే అంశంతో తెరకెక్కనుంది.
గతంలో వైఎస్ ఆర్ బయోపిక్ లో టైటిల్ రోల్ ను మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున వైఎస్ ఆర్ బయోపిక్ లో యాక్ట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ ఆర్ బయోపిక్ కథ విన్న నాగార్జున కొన్ని మార్పులు చేయాలని డైరక్టర్ కి సూచించారట. ఇవి అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా వైఎస్ ను చరిత్రలో నిలిచిపోయేలా చేసిన పాదయాత్ర ఘట్టం కూడా సినిమాలో కీలకంగా ఉంటుందట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.