అందానికే అందం లాంటి అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం.. నిజం కాకుండా ఉండి ఉంటే బాగుండునని మనసారా ప్రార్థిస్తున్నారు. తరలిరాని లోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవిని తలుచుకుని ఇంకా విలపిస్తూనే ఉన్నారు. తాజాగా.. ముంబైకి చెందిన బోరివాలి లోకల్ రైలులో.. ప్రకాశ్ అనే ఓ అభిమాని.. శ్రీదేవిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
చాందిని సినిమాలోని తేరే మేరే హాటోపే పాటను.. తన దగ్గర ఉన్న సంగీత పరికరంతో వాయించి నివాళి అర్పించాడు. శ్రీదేవి మళ్లీ వస్తే బాగుండునంటూ ఆవేదన చెందాడు. అదే సమయంలో.. రైలులో ప్రయాణిస్తున్న రచయిత వరుణ్ గ్రోవర్.. ఆ దృశ్యాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇప్పుడు శ్రీదేవి అభిమానుల సర్కిల్స్ లో.. ఈ వీడియో వైరల్ గా మారింది.
So last night in the crowded Borivali local, Prakash with his hand-made Sarangi started playing 'Tere mere honthon par'. Soon many of us in the bogey realised he's giving a medley-tribute to #Sridevi. Goosebumps followed. pic.twitter.com/qJr2HTgaWF
— वरुण (@varungrover) March 1, 2018