అలా చేస్తే చంద్రబాబుకు ఘన సన్మానం చేస్తాం: ముద్రగడ

Update: 2018-09-04 09:55 GMT

కాపులను బీసీల్లో చేర్చుతామనే హామీతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికంటే ముందే కాపులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే... లక్ష మందితో చంద్రబాబుకు ఘన సన్మానం చేస్తామని చెప్పారు.

Similar News