స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా టీజర్ను శుక్రవారం విడుదలచేశారు.1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. టీజర్లో..పాక్-భారత్ సరిహద్దు గేటు తెరవడం..యుద్ధాల నేపథ్యంలో ఆకాశ్ సైనికాధికారి గెటప్లో నేహాశెట్టి చేయి పట్టుకుని పరిగెత్తడం ఆకట్టుకుంటోంది. ‘మెహబూబా..’ అంటూ సాగుతున్న నేపథ్య సంగీతం హైలైట్గా నిలిచింది. 2015లో వచ్చిన ‘ఆంధ్రాపోరీ’ చిత్రంతో టాలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్ పూరీ. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేకపోయింది. ఇప్పుడు ‘మెహబూబా’ చిత్రంతోనైనా ఆకాశ్ హీరోగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.