నారా బ్రాహ్మణి ఆడ సింహంలాంటి వారు అంటూ బాలకృష్ణ కుమార్తెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు సినీ నటుడు మంచు మనోజ్. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులంతా ముందుకొచ్చి విరాళం అందజేస్తున్నారు. ఇటీవల నారా బ్రాహ్మణి కూడా ముందుకొచ్చి శ్రీకాకుళం జిల్లాలోని 10 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. దీనిపై మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పందించాడు.‘‘శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి చేస్తున్నది చూస్తుంటే నిజంగా స్ఫూర్తి కలిగిస్తోంది. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళల్లో ఆమె ఒకరు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న వారి కోసం నిలబడటం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. లయన్ కూతురు ఎప్పటికీ లయనే. జై బాలయ్య'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
Truly inspiring to see dng her bit for #Srikakulam!To one of the Strong Women I know :)A great move indeed @brahmaninara It’s really nice to see ppl stand up for doing good for the needy. Lions daughter wil always be Lioness :)Jaiiii Ballaya #WomenPower #TitliCyclone pic.twitter.com/7fg9Gr2MpF
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) October 24, 2018