ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్ గా ఉన్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. జనవరి 15 వరకూ సైలెంట్ గా ఉంటే ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందన్న నిర్మాత కోన వెంకట్ సలహాను పాటిస్తున్నానని చెప్పిన ఆయన, గత రాత్రి ఓ ట్వీట్ వదిలాడు. `ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిజాల కోసం జనవరి 16 వరకు ఆగండి` అని ట్వీట్ చేశాడు. కాగా, సంక్రాంతికి విడుదలైన `అజ్ఞాతవాసి`, `జైసింహా` సినిమాలపై కత్తి మహేష్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన 'అజ్ఞాతవాసి', ఓ చెత్తి సినిమా అని కత్తి రివ్యూ ఇచ్చిన తరువాత, పవన్ అభిమానులు ఆయనపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సినిమా థియేటర్లే ఏ చిత్రం భవిష్యత్తు ఏంటన్న విషయం చెబుతాయన్న అర్థం వచ్చేలా కత్తి ట్వీట్ వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి.
Empty vessels make much noise. Wait till 16th Jan for the truth.
— Mahesh Kathi (@MaheshhKathi) January 12, 2018