కత్తి మహేష్ పరిచయం అవసరం లేని పేరు.. తన హాట్ కామెట్స్ తో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాడు.. నిత్యం పవన్ కళ్యాణ్ పేరు జపం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నాడు.. అయితే తాజాగా బాలయ్యను కూడా కత్తి మహేష్ వదలలేదు.. బాలయ్య మీద తీవ్ర విమర్శలు చేశాడు.. తాజాగా ఓ ప్రోగ్రామ్ లో కత్తి మాట్లాడుతూ బాలయ్య గురించి ప్రస్తావించాడు.. బాలయ్య ఓ చదువులేని మూర్ఖుడని తాను గతంలోనే వ్యాఖ్యానించినట్టు కత్తి మహేష్ చెప్పాడు.. అంతేకాక పవన్ కంటే బాలయ్య మీద నేను ఎక్కువ విమర్శలు చేశానని చెప్పాడు.
`మనుషులను, అభిమానులను కొట్టడం అనైతికం. ఆయనకి మెడికల్ కౌన్సిలింగ్ అవసరం. వీలైనంత త్వరగా బాలయ్యను హాస్పిటల్కు తీసుకెళ్లాలి. తను ఓ రాజు అయినట్టు, తన వంశం మాత్రమే గొప్పదైనట్టు బాలయ్య ఫీలవుతున్నాడు` అని వ్యాఖ్యానించాడు. తనకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నచ్చి ఎంతో మెచ్చుకున్నానని, కానీ, బాలయ్య ప్రవర్తన చాలా అనాగరికంగా ఉంటుందని మహేష్ చెప్పాడు. తను పవన్కల్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు, మోదీ.. ఎవరి గురించైనా ధైర్యంగా మాట్లాడగలనని చెప్పాడు.