కన్నీటి పర్యంతం

Update: 2018-08-30 11:45 GMT

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పటించారు. ఇక తండ్రిని కడసారి చూస్తూ జూనియర్ ఎంటీఆర్ భావాద్వేగానికి లోనయ్యారు.. తండ్రిని చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి హరికృష్ణ పార్థివ దేహం చేరుకున్న అనంతరం శాస్త్రోక్తమైన క్రతువు చేశారు ఇక హరికృష్ణ చివరి చూపు కోసం తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు అంత్యక్రియల సందర్భంగా మెదట హరికృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం పోలీసులు గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం తండ్రికి కళ్యాణ్ రామ్ తలకొరువి పెట్టారు. 

Similar News