జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిరసన కవాతు నిర్వహించనున్నారు. కవాతులో అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. ఆర్కే బీచ్ కాళీ మందిర్ నుంచి వైఎంసీఏ వరకు కవాతు సాగనుంది. ఈ కవాతులో ఆరెంజ్, ఆలీవ్ గ్రీన్, వైట్ డ్రెస్లలో జన సైనికలు పాల్గొననున్నారు. ఆరెంజ్ కోడ్ వివకానందుడు స్పూర్తిగా, ఆలీవ్ గ్రీన్ సైనికులు, భగత్ సింగ్ స్పూర్తిగా వైట్డ్రెస్ కోడ్తో అభిమానులు ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను గళమెత్తడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ర్యాలీని ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.